Wednesday, April 24, 2024

కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ఒంగి ఒంగి దండాలు పెడుతున్నాడు: బండి సంజయ్

ఢిల్లీలో పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ అక్కడ ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ ఎవరి కోసం, ఎందుకోసం కడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ను బీజేపీ నమ్మదని.. టీఆర్ఎస్‌తో కలిసి బీజేపీ పని చేసే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

మతతత్వ పార్టీ ఎంఐఎం కలిసి టీఆర్ఎస్ పని చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. దళితబంధు మాదిరే బీసీ బంధు, గిరిజన బంధు కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 80 శాతం మంది హిందువులు ఉన్న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని కేసీఆర్… దళితబంధు ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement