Wednesday, April 24, 2024

పాదయాత్రలో బండి ప్రభంజనం.. కుత్బుల్లాపూర్​లో తొలిరోజు సక్సెస్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర తొలిరోజు సక్సెస్ అయ్యింది. హైదరాబాద్​లోని కుత్భుల్లాపూర్ ప్రజలు సంజయ్​కి బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర పొడువునా జనం నీరాజనం పలికారు. తొలిరోజు చిత్తారమ్మ ఆలయం వద్ద అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రాంలీలా మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఇక.. రాత్రి పొద్దుపోయే దాకా నడక కొనసాగించారు. మొత్తం 7 కిలోమీటర్లు మాత్రమే నడిచినప్పటికీ… దారి పొడవునా జనం ఎదురేగి ఘన స్వాగతం పలికారు.

మినీ భారత్ ను తలపించే కుత్బుల్లాపూర్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సైతం బండి సంజయ్ ను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. సంజయ్ ను చూడగానే దగ్గరకొచ్చి తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు సెల్ఫీలు దిగారు. బహిరంగ సభా స్థలి నుండి మధ్యాహ్నం లంచ్ శిబిరం వద్దకు రావడానికి దాదాపు 3 గంటలకుపైగా సమయం పట్టిందంటే జన స్పందన ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మహిళలు సంజయ్ ను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఇండ్లు లేవని కొందరు, రేషన్ కార్డుల్లేవని మరికొందరు.. ఉపాధి లేదని ఇంకొందరు.. డ్రైనేజీ, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో కాలుష్యంతో అల్లాడిపోతున్నామని.. ఇలా పెద్ద ఎత్తున బండి సంజయ్ ను కలిసి సమస్యలను విన్నవిస్తూ వినతి పత్రాలు అందజేశారు. అందరి బాధలు వింటూ… బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ సంజయ్ రాత్రి బసవైపుగా ముందుకు సాగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement