Tuesday, March 26, 2024

ఫ్యాన్స్ తో క‌లిసి వీర‌సింహారెడ్డి చిత్రాన్ని వీక్షించిన బాల‌కృష్ణ‌

నేడు వీర‌సింహారెడ్డి చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.సంక్రాంతి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా నేడు వీరసింహా రెడ్డి సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. విదేశాల్లో తెల్లవారుజామున 2 గంటలకే షోలు మొదలయ్యాయి. కాగా హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లి భ్ర‌మ‌రాంబ థియేట‌ర్ లో వీర‌సింహారెడ్డి బెనిఫిట్ షోని ప్ర‌ద‌ర్శించారు. కాగా ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడానికి హీరో బాల‌కృష్ణ అక్కడికి చేరుకున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌తో థియేటర్‌ నిండిపోయింది. జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. డప్పులు, బ్యాండ్‌బాజాలతో తమ అభిమానహీరోకు ప్రేక్షకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడం సంతోషంగా ఉందని, వారి స్పందన బాగుందని బాలకృష్ణ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement