Thursday, April 25, 2024

మనం సొంత కుటుంబంగా పిలిచే ఏకైక వ్యక్తి బాలకృష్ణ.. అలేఖ్య‌రెడ్డి పోస్ట్

దివంగ‌త న‌టుడు తార‌క‌ర‌త్న భార్య అలేఖ్య రెడ్డి హీరో బాల‌కృష్ణ గురించి ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. మనం సొంత కుటుంబంగా పిలిచే ఏకైక వ్యక్తి బాలకృష్ణ . కష్ట, సుఖాల్లో చివరి వరకు ఒక కొండలా అండగా నిలిచిన ఏకైక వ్యక్తి. ఒక తండ్రిలా ఆసుపత్రికి తీసుకెళ్లడం దగ్గర నుంచి ఆసుపత్రిలో నీ బెడ్ పక్కన కూర్చోవడం, నీ కోసం తల్లిలా పాటలు పాడటం, సిల్లీ జోక్స్ వేసి నువ్వు రియాక్ట్ కావాలని ప్రయత్నించడం, చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం… ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు. ఓబు (తారకరత్న) నీవు తొందరగా వెల్లిపోయావు. మిస్ యూ సోమచ్’ అని అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మార్ఫింగ్ ఫొటోను ఎవరు పెట్టారో కానీ… వారికి థ్యాంక్స్ చెపుతున్నానని అలేఖ్య అన్నారు. చాలా అందంగా ఎడిట్ చేశారని చెప్పారు. ఫొటో విషయానికి వస్తే… తమ పిల్లలను బాలయ్య ఎత్తుకున్న ఫొటోలో పక్కన తారకరత్న కూర్చున్నట్టు ఎవరో మార్ఫింగ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement