Saturday, March 23, 2024

ఆర్య ద‌యాల్ వాయిస్ తో ప్రేమ‌లో ప‌డ‌తారు..

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్వి న్‌, వైష్ణవి చైతన్య నటిస్తున్న చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్‌ దర్శకుడు. ఎస్‌.కే.ఎన్‌ నిర్మించారు. ఈ సిని మా నుంచి తాజాగా మెలోడీ పాట సిద్దం చేసింది బేబీ చిత్ర బృందం. ఈ సారి మళయాలంలో పాపులర్‌ సిం గర్‌గా ఆర్య దయాల్‌ ఈ పాటను పాడించడం విశేషం. అంతేకాదు.. ఆర్య దయాల్‌ పాడుతుండగా ఈ గీతాన్ని వీడియో గానూ చేశారు. త్వరలోనే ఈపాటను విడుదల చేసేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజా గా సింగర్‌ చేత చేయించిన లిరికల్‌ వీడియో పూర్తయిన సందర్భంగా చిత్ర దర్శకుడు సాయి రాజేశ్‌ మాట్లాడుతూ ”బేబీ సినిమా ఫస్ట్‌ సాంగ్‌ ఓ పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మళయాలీ సింగర్‌ ఆర్య దయాల్‌ చేత ఈ పాటను పాడించాం. ఈ పాటను మా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో కలిసి తన కోసమే కంపోజ్‌ చేశాం. ఈ పాట మొదటి పాటకు ఏ మాత్రం తీసిపోదు. ఇక ఫస్ట్‌ సాంగ్‌ కు మించి ఈ పాట పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఓ పాటకు పెట్టాల్సినంత బడ్జెట్‌ను ప్రమోషనల్‌ మ్యూజికల్‌ వీడియోకే పెట్టారు. ఆర్యదయాల్‌ మొదటి పాట నా సినిమాలోనిది కావడం గర్వంగా ఉంది. ఈ పాట తర్వాత తెలుగు ప్రజలు తన వాయిస్‌ తో ప్రేమలో పడతారు అని ఖచ్చితంగా చెప్పగలను.” అన్నారు


నిర్మాత ఎస్కేఎన్‌ మాట్లాడుతూ ”తొలిసారి వర్ధమాన నటుడి సినిమాకు లిరికల్‌ వీడియో కోసం సెట్‌ వేసి సాంగ్‌ చేయడం ఇదే ప్రధమం అనుకుంటా. దీనికి కారణం బేబీ సినిమా మొదటి పాటకు వచ్చిన స్పందన. ఈ రెండవ లిరికల్‌ పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా ఆనంద్‌, వైష్ణవి, విరాజ్‌ లకు చాలా పేరు వస్తుందని నమ్ముతున్నాను.” అన్నారు.
గాయని ఆర్య దయాల్‌ మాట్లాడుతూ ”పాట కోసం తెలుగు భాష నేర్చు కోవడం సంతోషంగా అనిపించింది. రికార్డింగ్‌ అంతా చాలా సరదాగా జరిగింది. ఈ ప్రాజెక్ట్‌ లో భాగమైనందుకు సంతోషంగా ఉంది.”అన్నారు.
కో ప్రొడ్యూసర్‌ ధీరజ్‌ మొగిలినేని మాట్లాడుతూ ” మొదటి పాట ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలుసు. కానీ ఈ రెండో పాట అంతకు డబుల్‌ రేంజ్‌ లో ఉంటు-ంది.” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement