Friday, March 29, 2024

పూజల పేరుతో మహిళపై బాబా అత్యాచారం…వీడియో తీసి బెదిరింపులు

టెక్నాలజీ ఎంత పెరుగుతున్న కొంతమంది బుడ్డి భాగాల చేతిలో మోసపోతూనే ఉన్నారు. తాజాగా యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. దంపతుల గొడవల్లో తలదూర్చిన ఇద్దరు బురిడీ బాబాలు తలదూర్చారు. మీ సమస్య పరిష్కరిస్తామని పూజలు కూడా మొదలు పెట్టారు. పూజల పేరుతో భాదితురాలిపై అత్యాచారానికి ఓ బాబా పాల్పడ్డాడు. కాగా అత్యాచార ఘటనను వీడియో తీసి అనంతరం బాధితురాలిని బ్లాక్ మెయిలింగ్ చేశారు.

బాధితురాలి దగ్గర లక్షలు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆగక పోవడంతో పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేయకుండా స్థానిక పోలీసులు సెటిల్ మెంట్ కు ప్రయత్నాలు చేశారు. వీడియోలు డిలీట్ చేసి బాధితురాలికి బాబాల నుంచి కొంత డబ్బు ను పోలీసులు ఇప్పించి నట్లు తెలుస్తోంది. మిగితా డబ్బు ఇవ్వక పోవడంతో బాధిత మహిళ రాచకొండ సీపీని ఆశ్రయించింది. ఇక ఈ విచారణలో పోలీసులు,బాబాల బాగోతం మొత్తం వెలుగులోకి వచ్చింది. కేసులో నిర్లక్ష్యం వహించిన రామన్న పేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ లను సస్పెండ్ సీపీ సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement