Saturday, April 20, 2024

టోక్యో ఒలింపిక్స్: ఫస్ట్ మ్యాచ్‌లోనే ఓడిన తెలుగు తేజం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్,  తెలుగు తేజం సాయి ప్రణీత్ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలయ్యాడు. శనివారం గ్రూప్-డి ఫురుషుల సింగిల్స్‌లో పోటీపడిన సాయి ప్రణీత్.. తన కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న ఇజ్రాయిల్ షట్లర్ మిశా జిబర్‌మాన్ చేతిలో ఓడిపోయాడు.17–21, 15–21  తేడాతో ఓటమి పాలైయ్యాడు. 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుపొందిన సాయి ప్రణీత్.. ప్రస్తుతం 15వ ర్యాంక్‌లో ఉన్నాడు. అయినప్పటికీ 47వ ర్యాంక్‌లో ఉన్న జిబర్‌మాన్‌కి పోటీనివ్వలేకపోయాడు. 41 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగిసిపోయింది. ఒలింపిక్స్‌లో సాయి ప్రణీత్ పోటీపడటం ఇదే తొలిసారి. తర్వాత మ్యాచ్‌ని నెదర్లాండ్స్‌ కి చెందిన మార్క్‌తో సాయి ప్రణీత్ ఆడనున్నాడు. కాగా, మార్క్ ప్రస్తుతం 29వ ర్యాంక్‌లో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement