తెలుగులో మరో -కై-ం సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతోంది. రణధీర్, సుభశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వూర శ్రీను దర్శకత్వంలో, లెక్కల మహేంద్రా రెడ్డి నిర్మాణంలో ‘అయోమయంలో అరవింద’ చిత్రం ప్రారంభం అయింది. డాక్టర్ ప్రసాద్ మూరెళ్ల సహకారా సారధ్యంలో రూపొందుతున్న ఈ సినిమా హైదరా బాద్ ఫిలింనగర్ వెంకటేశ్వర దైవ సన్నిదానంలో ప్రారంభోత్సవం జరుపుకుంది. హీరోహీరోయిన్లపై ముహూర్తం షాట్కు నిర్మాత తుమ్మలపల్లి క్లాప్ కొట్టారు. వి.శ్రీనివాసరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలిషాట్కు మేడిది వెంకటేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత లెక్కల మహేంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన కథలకు భిన్నంగా ఉంటూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. అని అన్నారు.
దర్శకుడు వూర శ్రీను మాట్లాడుతూ.. ఇది సస్పెన్స్ -కై-ం థ్రిల్లర్ చిత్రం. ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో థ్రిల్ కలిగించే కం-టె-ంట్.అన్నారుడాక్టర్ ప్రసాద్ మూరెళ్ళ మాట్లాడుతూ ఈ చిత్రం షూటింగ్ విశాఖ పట్నం ,అరకు, ఈస్ట్ ,వెస్ట్ గోదావరి , కడప లో చేస్తామని తెలిపారు. హీరో రణధీర్, హీరోయిన్ సుభశ్రీ తమ కు లభించిన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభ వేడుకలో హీరో తండ్రి బీసు చందర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, శ్రీనివాస్.. తదితరులతో పాటు-, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.