Thursday, March 28, 2024

2032లో ఒలింపిక్స్ నిర్వహించేది ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంగ్రామం ఒలింపిక్స్. అన్ని దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో వేలాది మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులు, అథ్లెట్లు ఈ పోటీల్లో పతకాన్ని సాధించి తమ దేశ కీర్తిని మరింత పెంచేందుకు తహతహలాడుతుంటారు. మరోవైపు ఈ పోటీలను నిర్వహించడాన్ని అన్ని దేశాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. ఎల్లుండి నుంచి జపాన్‌లో ఒలింపిక్స్ జరగనున్నాయి. టోక్యో ఈ వేడుకకు ఆతిథ్యమిస్తోంది.

మరోవైపు 2032లో జరగబోయే ఒలింపిక్స్ క్రీడలకు వేదిక ఖరారైంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఈ పోటీలను నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… ఎలాంటి పోటీ లేకుండానే ఈ బిడ్‌ను ఆస్ట్రేలియా దక్కించుకుంది. 2032లో ఒలింపిక్స్ పూర్తయిన తర్వాత జరగబోయే పారాలింపిక్స్ కూడా అక్కడే జరగనున్నాయి. 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో మళ్లీ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. 1956లో మెల్ బోర్న్, 2000లో సిడ్నీలో ఒలింపిక్స్ జరిగాయి. 2032లో ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఒలింపిక్స్ క్రీడలను విజయవంతం చేయడానికి ఏం చేయాలో ఆస్ట్రేలియాకు తెలుసని ఆ దేశ ప్రధాని మోరిసన్ చెప్పారు. ఇది బ్రిస్బేన్ నగరానికే కాకుండా, యావత్ దేశానికే చారిత్రాత్మకమైన రోజని అన్నారు. 2024 ఒలింపిక్స్ కు ప్యారిస్, 2028లో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టోక్యో ఒలింపిక్స్ ఈనెల 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగబోతున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: టీమిండియా ఆడుతుంటే.. ఆసక్తిగా చూసిన మరో టీమిండియా

Advertisement

తాజా వార్తలు

Advertisement