Friday, April 19, 2024

ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లకు ఆసీస్‌ ఆటగాళ్లు దూరం..

ఐపీఎల్‌ 2022 ప్రారంభ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. ఈ కారణంగా కమిన్స్‌, డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, స్టొయినిస్‌, హేజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌ తదితరులు ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లకు దూరం కానున్నారు. వచ్చే నెలలో ఆసీస్‌ జట్టు పాక్‌ పర్యటన ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మంగళవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. కాగా పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌తోపాటు టెస్టు సిరీస్‌ జరగనుంది.

మార్చి 4న మొదలయ్యే ఈ పర్యటన ఏప్రిల్‌ 5న ముగియనుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 6న ఆసీస్‌ ఆటగాళ్లు భారత్‌ రానున్నారు. అయితే ఐపీఎల్‌ 2022 మార్చి నెలఖారున ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. దీంతో 13మంది ఆసీస్‌ క్రికెటర్లు ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. మరోవైపు మ్యాక్స్‌వెల్‌ కూడా తన వివాహం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement