Wednesday, April 24, 2024

రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలం.. రేపు ఉద‌యం ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌ నగరంలోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు మంగళవారం డ్రా తీయనున్నారు. పదేళ్ల కిందట నిర్మించిన ఈ ఫ్లాట్లలో మిగిలిపోయిన ఒకటి, రెండు, మూడు పడక గదుల విక్రయానికి ప్రభుత్వం సెప్టెంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఒక పడకగదికి రూ.లక్ష, రెండు పడకగదులకు రూ.2 లక్షలు, మూడు పడకగదులకు రూ.3 లక్షలు టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లించారు.

వీరికి ఫ్లాట్ల కేటాయింపు కోసం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు బండ్లగూడ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పోచారం ఫ్లాట్లకు డ్రా తీయనున్నారు. ఫేస్‌బుక్‌, యూ ట్యూబ్‌లలో డ్రాను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement