Thursday, April 18, 2024

ప్రియుడితో కలిసి భర్త హత్యకు యత్నం.. తప్పించుకున్న భర్త..

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ఓ భార్య యత్నించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. అయితే భర్త ఈ ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. భార్య పార్వతి లారీతో యాక్సిడెంట్ చేయించి భర్తను హత్య చేయాలనుకుంది. భర్త శ్రీనివాస్ లారీ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడు. అయితే శ్రీనివాస్ పై ప్రియుడు శంకర్ సిమెంట్ రాయితో దాడి చేశాడు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న శ్రీనివాస్ విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివాహేతర సంబంధమే దాడికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement