Saturday, April 20, 2024

ఒంగోలులో అర్ధరాత్రి ఓ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి

ఒంగోలు చెన్నకేశవ కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో ఒక కుటుంబంపై కొంతమంది వ్యక్తులు పెట్రోల్ ఫైర్ బీర్ బాటిల్స్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. చెన్నకేశవ కాలనీకి చెందిన కుంచాల మహేష్‌కు ఒంగోలు మంగళకాలనీకి చెందిన హైపర్ అలీ, అక్రమ్ అలీ, గుంటూరు మహేష్, సుమంత్, గణేష్‌లకు మధ్య ఆర్థిక విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఈ గొడవ జరిగినట్లు మహేష్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

గతంలో ఇరువురి మధ్య జరిగిన గొడవలు నేపథ్యంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే కేసులను ఉపసంహరించుకోవాలని మహేష్ కుటుంబంపై మిగిలిన వాళ్లు ఒత్తిడి తెచ్చారు. అయితే మహేష్ కుటుంబ సభ్యులు కేసును ఉపసంహరించుకున్నా పాత కక్షలను మనసులో పెట్టుకొని ఈ దాడులకు తెగ పడినట్లు మహేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: బ్యాంకులకు రూ.200 కోట్లు టోకరా వేసిన నిందితుడి అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement