Thursday, April 25, 2024

క‌విత ఇంటిపై దాడి దారుణం : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఎమ్మెల్సీ క‌విత ఇంటిపై బీజేపీ దాడి దారుణమని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓ మ‌హిళా నాయ‌కురాలి ఇంటిపై దౌర్జ‌న్యం చేయ‌డం విచార‌క‌ర‌మని, ఇదేనా బీజేపీ సంస్కారం అని నిల‌దీశారు. రౌడీ రాజకీయాలు బీజేపీ మానుకోవాలి.. ప్రధాని మోదీ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతున్నందుకే బీజేపీ నేత‌లు దాడులకు దిగుతున్నార‌ని, ప్ర‌శాంతంగా ఉన్న తెలంగాణ‌లో చిచ్చుపెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని మంత్రి మండిపడ్డారు. బీజేపీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని, ప్రజాస్వామ్య విలువలను పాటించే ప్రతి ఒక్కరూ ఈ దాడిని గర్హించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement