Saturday, April 20, 2024

HYD: బార్ యజమానిపై దాడి.. రూ.2కోట్లు దోపిడీ

బార్ యజమానిపై దాడి చేసి రూ.2కోట్ల నగదును దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది. బార్ మూసిన తర్వాత కలెక్షన్స్ తో ఇంటికెళ్తున్న మేనేజర్ వెంకట్రామిరెడ్డిపై దాడి జరిగింది. వనస్థలిపురం చౌరస్తాలో వెంకట్రామిరెడ్డిని అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు వెంకట్రామిరెడ్డిపై దాడి చేసి రూ.2కోట్లు లాక్కెళ్లారు. రెండు బార్లు, వైన్ షాపుల కలెక్షన్స్ ను దుండగులు దోచుకెళ్లారు. పోలీస్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకొని దోపిడీపై విషయాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement