Saturday, April 20, 2024

దారుణం….25 ఏళ్ల వ్యక్తి 14 ఏళ్ల బాలికపై అత్యాచారం

బంజారా హిల్స్ లో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి మైనర్ బాలికపై రాజేష్ అనే వ్యక్తి లైంగికదాడి చేశాడు. డ్రైవర్ గా పని చేసే రాజేష్ వయస్సు 25 సంవత్సరాలు. అతనికి వివాహమై విడాకులు తీసుకొని బంజారాహిల్స్ లక్ష్మీ నరసింహ నగర్ లో ఒంటరిగా నివాసముంటున్నారు. కాగా సమీపంలో నివసించే ఓ బాలిక వయసు 14 సంవత్సరాలు. 8వ తరగతి చదువుతోంది.

అయితే ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు రాజేష్. ఆ తరువాత ఏడుస్తూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని బాధిత యువతి చెప్పింది. అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement