Thursday, April 25, 2024

పెద్దపల్లి జిల్లాలో దారుణం.. తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం

తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి లో చోటుచేసుకుంది. బాలిక జమ్మికుంట మండలం ఇల్లంతకుంట నుండి వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరికి రాగ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై గ్రామానికి చెందిన రమేష్ అత్యాచారానికి పాల్పడ్డాడని బంధువులు పేర్కొన్నారు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రమేష్ పరారీలో ఉండగా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement