Saturday, April 20, 2024

Big Breaking: తిరుప‌తిలో దారుణం.. చికెన్ సెంట‌ర్ య‌జ‌మానిపై అటాక్‌, క‌త్తితో పొడిచి చంపేశాడు!

తిరుపతి సిటీ, (ప్రభన్యూస్): ఏపీలోని తిరుపతి సిటీలో దారుణం జ‌రిగింది. చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్న‌ చికెన్ సెంట‌ర్ య‌జ‌మాని స్టాఫ్ రాజా (25)ని శుక్రవారం రాత్రి కత్తితో పొడిచి చంపేశారు. చికెన్ సెంటర్ వద్ద రాజు మద్యం మత్తులో ఘర్షణ పడుతుండ‌డంతో మాజీ వ‌లంటీర్ నాని అనే వ్య‌క్తి ఈ హ‌త్య చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య విష‌యం తెలియడంతో డీఎస్పీ మురళి కృష్ణ, అలిపిరి సీఐ అబ్బన్న, ఎస్సై రెడ్డప్ప సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మ‌ర్డ‌ర్ కేసు విష‌యంలో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement