Thursday, April 25, 2024

సిద్దిపేట జిల్లాలో దారుణం.. వ్యక్తిని కొట్టి చంపిన దుండగులు

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియ‌ని దుండ‌గులు వ్య‌క్తిని కిరాత‌కంగా కొట్టి చంపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి… గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో కామల్ల కృష్ణ (40) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా కొట్టి హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీయ‌డంతోపాటు… మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. ఈమేర‌కు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యపై కొద్దిరోజులుగా కుటుంబ, భూ తగాదాలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement