Wednesday, March 27, 2024

శంషాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శంషాబాద్‌లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల పసిపాపపై లైంగిక దాడి జరిగింది. తెలిసిన వ్యక్తే ఈ అమానుష ఘటనకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం పొట్టచేతపట్టుకుని హైదరాబాద్‌ వచ్చారు. ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌ వెళ్లే నేషనల్‌ హైవే 44లో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనుల్లో కూలీలుగా చేస్తున్నారు. వంతెన పక్కనే మిగతా కూలీలతో పాటు గుడిసె వేసుకుని ఉంటున్నారు. వారితో పాటు గుడిసె వేసుకుని కూలీ పనులు చేస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకటయ్య అనే వ్యక్తి బాలికపై కన్నేశాడు.

ఆదివారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చారు. బాలిక ఇంట్లో ఎవరు లేరని తెలుసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ముందుగా అమ్మాయిని హింసించి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఏమీ తెలియని పసిపాప వాడి చేష్టలకు గట్టిగా కేకలు వేసింది. చంపుతున్నాడని పాప అరుపులు విన్న పక్క గుడిసెల వారు అక్కడికి చేరారు. ఈ లోగా పాప తల్లిదండ్రులు కూడా వచ్చి వెంకటయ్యను చితకబాదారు. ఆ తర్వాత కీచకుడిని పోలీసులకు అప్పగించారు . పాపకు తీవ్ర రక్తస్రావం జరగడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిలో చేర్చించారు. అమ్మాయికి సర్జరీ జరిగినట్లు సమాచారం. శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement