Friday, March 29, 2024

Breaking | ఏలూరులో దారుణం.. ఒకే ఇంట్లో త‌ల్లీ కూతుళ్ల దారుణ హ‌త్య‌..

ఏపీలోని ఏలూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడులో ఓ ఇంట్లో త‌ల్లీ కూతుళ్లు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అయిదేళ్ల క్రితం ఆ మ‌హిళ భ‌ర్తతో విడిపోయి ఒంట‌రిగానే ఉంటోంది. కాగా మీర్జాపురానికి చెందిన వ్య‌క్తితో ఆమె వివాహేత‌ర సంబంధం (స‌హ‌జీవ‌నం) కొన‌సాగిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, ఇవ్వాల ఆ మ‌హిళ‌తో పాటు ఆమె కూత‌రు కూడా మ‌ర్డ‌ర్ కావ‌డంతో విషాదం అలుముకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌ర్డ‌ర్ ఎలా జ‌రిగింది, ఎవ‌రు చేశార‌నే కోణంలో విచార‌ణ జ‌ర‌పుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement