Saturday, April 20, 2024

కాలేజీలో దారుణం.. విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్..

ఘట్కేసర్‌లోని ఇంజినీరింగ్‌ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ విద్యార్థినిల ఫొటోలను కొందరు ఆగంతకులు మార్ఫింగ్‌ చేస్తున్నారు. విద్యార్థినిల ఫొటోలను న్యూడ్‌గా తయారు చేసి వాట్సాప్‌ గ్రూప్‌ల్లో పోస్టింగ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ మార్ఫింగ్‌ ఫొటోలను ఆగంతకులు విద్యార్థులకు పంపి వేధింపులకు గురిచేస్తున్నారు. విద్యార్థినిల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘట్కేసర్‌లోని ఇంజినీరింగ్‌ కాలేజీకి వెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే మార్ఫింగ్‌ ఫొటోలపై విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement