Saturday, April 20, 2024

ఆరేళ్ల వ‌య‌సులోనే కేర‌ళ క‌లెక్ట‌ర్ కి.. లైంగిక‌వేధింపులు

ఆరేళ్ల వ‌య‌సులో లైంగిక‌వేధింపుల‌కి గుర‌య్యార‌ట కేర‌ళ క‌లెక్ట‌ర్ దివ్య ఎస్ అయ్య‌ర్.ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా తెలిపారు. కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లా కలెక్టర్ గా ఉన్నారు దివ్య ఎస్ అయ్యర్.కాగా ఆమె తన వ్యక్తిగత విషయాన్ని బహిర్గతం చేసింది. ఆమె చెప్పిన సమాచారం ప్రకారం ఆమె ఆరేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆమెను ఎంతో ప్రేమగా దగ్గరకు పిలిచి దుస్తులు విప్పారట..అయితే ఆమె వారి చేష్టలకు భయంతో పారిపోయిందట. ఆ తరువాత దివ్య అయ్యర్ తల్లితండ్రుల సహాయంతో ఆ దుర్ఘటన నుండి బయటపడిందట. ఈ సంఘటనను తలుచుకుని ఆమె తనకు జరిగిన ఒక చెడు అనుభవాన్ని తలుచుకుని బాధపడింది. అయితే ఈమె ఇప్పుడు ఈ సంఘటన గురించి చెప్పడానికి కారణం పిల్లలకు తల్లితండ్రులు గుడ్ .. బ్యాడ్ టచ్ ల గురించి చెప్పాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement