Wednesday, April 24, 2024

అస్సాం రైఫిల్స్ సైనికుల‌పై ..ఉగ్ర‌వాదుల కాల్పులు-ఒక‌రికి గాయాలు

అస్సాం రైఫిల్స్ సైనికుల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు.ఈ ఘ‌ట‌న‌లో ఒక అధికారికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని రక్షణ ప్రతినిధి ఒకరు ధృవీక‌రించారు. తిరప్ చాంగ్లాంగ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒక సిబ్బందికి గాయాలైనట్లు తేజ్‌పూర్‌లోని డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ అధికారికి సమాచారం అందించారు. ఇండో మయన్మార్ సరిహద్దు నుండి మిలిటెంట్ జీపీఎస్ AR tps పై కాల్పులు జరిపిన సంఘటన జెన్ ఏరియా తిరప్ చాంగ్లాంగ్‌లో జరిగింది. ఓ అధికారి చేతికి చిన్న గాయం అయ్యింది అని డిఫెన్స్ PRO ట్వీట్ చేశారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో అస్సాం రైఫిల్స్ దళాలు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement