Friday, March 29, 2024

ఏసియన్‌ ఎలైట్‌ బాక్సింగ్‌, సెమీఫైనల్స్‌కు మీనాక్షి.. క్వార్టర్స్‌లో సాక్షి ఓటమి

2022 ఏసియన్‌ ఎలైట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్‌ మీనాక్షి సెమీఫైనల్‌కు చేరింది. దీంతో భారత్‌కు ఓ పతకం ఖాయం. శనివారంనాడిక్కడ క్వార్టర్‌ఫైనల్స్‌లో 52 కేజీల విభాగంలో ఫిలిప్పీన్స్‌ బాక్సర్‌ ఐరిస్‌ మాగ్నోపై 4-1తేడాతో మీనాక్షి విజయం సాధించింది. ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్‌కు మెడల్‌ ఖాయం చేసింది మీనాక్షి. తదుపరి పోరులోనూ విజయం సాధించి, స్వర్ణ పతకం సాధిస్తానని భారత మహిళా బాక్సర్‌ మీనాక్షి ధీమా వ్యక్తం చేస్తోంది. అటు సాక్షి మాత్రం క్వార్టర్‌ఫైనల్‌లో పరాజయం పాలై టోర్నీ నుంచి వైదొలగింది. 54 కేజీల విభాగంలో ప్రత్యర్థి చైనీస్‌ తైపీ హసియా-వెన్‌ హుయాంగ్‌ చేతిలో 0-5 తేడాతో సాక్షి ఓటమిని చవిచూసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement