Wednesday, April 24, 2024

క‌పిల్ రికార్డ్ ని టార్గేట్ చేసిన అశ్విన్..

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు శ్రీలంకతో జరగనున్న సిరీస్ కీలకం కాబోతోంది. భారత దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును అధిగమించేందుకు అశ్విన్ కు ఈ సిరీస్ అవకాశం కల్పిస్తోంది. టెస్ట్ క్రికెట్లో కపిల్ దేవ్ 434 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఇప్పటి వరకు 430 వికెట్లు తీసి ఆ రికార్డ్ కు చేరువ‌లో ఉన్నాడు. మరో ఐదు వికెట్లు తీస్తే కపిల్ ను అధిగమిస్తాడు. 131 టెస్టుల్లో 434 వికెట్లు ప‌డ‌కొట్టాడు క‌పిల్.. కాగా.. అశ్విన్ 84 టెస్టుల్లోనే 430 వికెట్లు సాధించాడు.

మరోవైపు అశ్విన్ మరో ఇద్దరు బౌలర్లను కూడా అధిగమించే అవకాశం ఉంది. మరో రెండు వికెట్లు తీస్తే 86 టెస్టుల్లో 431 వికెట్లు తీసిన న్యూజిలాండ్ దిగ్గజం సర్ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును అధిగమిస్తాడు. మరో మూడు వికెట్లు తీస్తే 93 టెస్టుల్లో 433 వికెట్లు తీసిన శ్రీలంక వెటరన్ రంగనా హెరాత్ రికార్డును దాటేస్తాడు. ఈ నెల 4న మొహాలీలో శ్రీలంకతో తొలి టెస్టు ప్రారంభంకానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement