Wednesday, April 24, 2024

జూన్ 22 నుంచి ఆషాఢ బోనాలు.. జులై 9న లష్కర్​ బోనాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జూన్‌ 22నుంచి ఆషాఢమాస బోనాల జాతర ప్రారంభం అవుతుందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. శుక్రవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. మంత్రులు ఉంద్రకరణ్‌ రెడ్డి,మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ శాంతికుమారి, మేయర్‌ విజయ లక్ష్మీ, డీజీపీ అంజనీకుమార్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని బోనాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 22 జూన్‌న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.

- Advertisement -

9జూలైన సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు, 10న రంగం ఉంటుందని తెలిపారు. 16న పాతబస్తీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు జరగనుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని గుర్తుచేశారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాలఉత్సవాలు జరుగుతున్నాయనీ, ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించిందని తలసాని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement