Thursday, April 25, 2024

స్పైసెస్ బోర్డు సభ్యులుగా అరవింద్, బాలశౌరి.. ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: స్పైసెస్ బోర్డులో సభ్యులుగా లోక్‌సభ నుంచి ఇద్దరు తెలుగు ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి (వైఎస్సార్సీపీ), నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (బీజేపీ) స్పైసెస్ బోర్డ్ సభ్యులుగా ఎన్నికైనట్టు లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. స్పైసెస్ బోర్డ్ చట్ట – 1986 ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగా.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నాటికి మొత్తం ముగ్గురు సభ్యులు నామినేషన్లు చేశారు. వారిలో హిబి ఈడెన్ తన నామినేషన్ వెనక్కి తీసుకోవడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండానే ఇద్దరు తెలుగు ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement