Monday, March 25, 2024

ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్‌గా అరుణ్ గోయ‌ల్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

న్యూఢిల్లీ : భార‌త ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్‌గా ఇవాళ అరుణ్ గోయ‌ల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రెండు రోజుల క్రితం ఆయ‌న‌కు కొత్త అపాయిట్మెంట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో ముగ్గురు క‌మీష‌న‌ర్లు ఉంటారు. అయితే మే నెల‌లో సుశీల్ చంద్ర రిటైర్ కావ‌డంతో ఓ పోస్టు ఖాళీగా ఉంది. సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత అనుప్ చంద్ర పాండే మ‌రో క‌మీష‌న‌ర్‌గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement