Friday, April 19, 2024

ఏపీలోని నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఆర్మీలో చేరాలనుకుంటున్న అభ్యర్థులకు ఇండియన్‌ ఆర్మీ సువర్ణావకాశం కల్పించబోతుంది. పోస్టుల ఆధారంగా 8వ తరగతి, టెన్త్, ఇంటర్‌ పాసైతే చాలు.. సైనికుడిగా దేశ సేవ చేయొచ్చు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీకి అర్హులు. అర్హత గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్ మన్ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీని చేపట్టనున్నారు. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించడానికి ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంది. ఈ ఆర్మీ ర్యాలీని మే 16 నుంచి 30 వరకు అధికారులు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement