Wednesday, April 24, 2024

Breaking: బోర్డర్​ దాటేందుకు యత్నించిన పాకిస్తానీ యువకుడు.. అరెస్టు చేసిన ఆర్మీ

దేశ సరిహద్దు దాటడానికి యత్నిస్తున్న పాకిస్తాన్​ యువకుడిని ఆర్మీ ఇవ్వాల (ఆదివారం) అరెస్టు చేసింది. 21 ఏళ్ల పాకిస్తానీ జాతీయుడు అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) మీదుగా భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించినట్టు అధికారులు తెలిపారు. మాలిక్ చక్ నివాసి అయిన సాబెర్ నవాజ్ నిన్న (శనివారం) జమ్మూ శివార్లలోని అఖ్నూర్ సెక్టార్‌లోకి ప్రవేశించాడు. సరిహద్దులో కాపలాగా ఉన్న భారత సైన్యం అతడిని గమనిచిందని అధికారులు తెలిపారు. నవాజ్‌ను ముందుగా హెచ్చరించారని, అయినా వినకుండా సరిహద్దు దాటేందుకు యత్నించడంతో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. విచారణ నిమిత్తం ఆదివారం ఖౌర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement