Thursday, April 25, 2024

క‌స్ట‌డీ చిత్రం నుంచి…

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. వెంకట్‌ ప్రభు దర్శకుడు. తెలు గు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ ఇటివలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.
ఇటీ-వల విడుదల చేసిన హీరోయిన్‌ కృతి శెట్టి పాత్ర పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా చిత్ర బృందం మరో కీలకపాత్రధఆరి నటుడు అరవింద్‌ స్వామి పాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. అరవింద్‌ స్వామి ఈ చిత్రంలో రాజు అలియాస్‌ రాజు పాత్ర పోషిస్తున్నారు.
అతని లుక్‌ సంకెళ్లతో బార్స్‌ వెనుక కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రియమణి మరో కీలక పాత్రధారిణి. ఈ చిత్రంలో శరత్‌ కుమార్‌, సంపత్‌ రాజ్‌, ప్రేమ్‌ జీ, వెన్నెల కిషోర్‌, ప్రేమి విశ్వనాథ్‌ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్‌ స్కీన్ర్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి సంభాషణలు రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కస్టడీ చిత్రాన్ని మే 12న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement