Wednesday, April 17, 2024

రేపే ఎప్‌సెట్‌ ఫలితాలు.. విజయవాడలో విడుదల చేయనున్న మంత్రి బొత్స

అమరావతి, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌ సెట్‌- 2022 ఫలితాలు రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ సెట్‌ను అనంతపురంలో విడుదల చేస్తారని ముందు ప్రకటించినా.. తాజాగా మార్పు చేసి, విజయవాడలోని ఓ హోటల్లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల నాలుగో తేదీ నుంచి 8వ తేదీ వరకు పది సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలకు 2 లక్షల 6 వేల 579 మంది దరఖాస్తు చేసుకోగా.. లక్షా 94 వేల 752 మంది(94.27 శాతం) హాజరయ్యారు.

అలాగే ఈ నెల 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో జరిగిన అగ్రికల్చర్‌, ఫార్మసీ సీట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 94 వేల 593 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 87 వేల 744 మంది(92.76 శాతం) హాజరై పరీక్షలు రాశారు. మొత్తంగా 3 లక్షల ఒక వెయ్యి 172 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2 లక్షల 82 వేల 496 మంది(93.8 శాతం) హాజరయ్యారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement