Saturday, April 20, 2024

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(ఏపీపీఎస్సీ) 2018లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల వివరాల కోసం ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్ ‌www.psc.ap.gov.inను సంద‌ర్శించవచ్చు. అర్హ‌త సాధించిన‌ అభ్యర్థులకు జూన్‌ 14వ తేదీ నుంచి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించ‌నున్నారు. ఇత‌ర వివ‌రాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు.

కాగా 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయగా డిసెంబర్, 2020లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజ‌ర‌య్యారు. ఏపీలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 34 సెంటర్లు ఏపీలో ఉండగా, 7 సెంటర్లు హైదరాబాద్‌లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement