Wednesday, April 24, 2024

ఐ అండ్‌ పీఆర్‌ టీన్జీవో నూతన కమిటీ నియామకం, ఏకగ్రీవంగా ఎన్నిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా డి జితేందర్‌, కార్యదర్శిగా కె అనిల్‌ కుమార్‌లు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ (టీఎన్జీవో) నేతల ఆధ్వర్యంలో మంగళవారం యూనియన్‌ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా టీఎర్జీవో హైదరాబాద్‌ నగర అధ్యక్ష, కార్యదర్శి శ్రీరామ్‌, కె శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా అభినందించారు.

నూతన కమిటీ కోశాధికారిగా దుర్గప్రసాద్‌, మిగతా సభ్యులుగా ఉమేష్‌, శ్రీలత, మీనాక్షి, నరేష్‌, నాగరాజు, ఇందిరా, రాజు, ఎంఎ మాజిద్‌, సంగీత, లక్ష్మీనారాయణ, రాజ్‌ కుమార్‌, స్వర్ణలత తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సమాచార పైరసంబంధాల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐ అండ్‌ పీఆర్‌ డైరెక్టర్‌ రాజమౌళి, అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే, సంయుక్త సంచాలకులు డిఎస్‌ జగన్‌, డి శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, ఉప సంచాలకులు ఎం మధుసూదన్‌, ఎస్‌ పాండురంగారావు, జి ప్రసాదరావు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement