Friday, April 19, 2024

బీసీ గురుకులాల్లో ఇంటర్‌, డిగ్రీ కోసం దరఖాస్తులు.. ఈనెల 22 వ‌ర‌కు చివరి తేదీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీసీ గురుకుల విద్యాలయాల సంస్థలో ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈనెల 22వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. బీసీ బాల బాలికల గురుకుల కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. డిగ్రీ కోర్సులు కోసం కేవలం బాలికలు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూన్‌ 5న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి సీట్లు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంటర్‌లో చేరాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 సంవత్సరంలో పదవ తరగతి చదివి ఉండాలన్నారు.

డిగ్రీలో చేరాలనుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలో 2021-22 సంవత్సలో ఇంటర్‌ చదివి ఉండాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000 , పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000 లకు మించరాదు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడంకోసం MJPTBCWREIS.in Telangana.com Jivovi.in వెబ్‌సైట్‌ను చూడాలని మల్లయ్యయభట్టు సూచించారు. ఏదైనా సందేహాలు ఉంటే మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురు కుల విద్యాలయం కార్యాలయం ఫోన్‌ నెంబర్లు 040-23322377, 23328266లో సంప్రదించాలని ఆయన కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement