Tuesday, March 26, 2024

జగన్ సీఎం అయితే ఏపీ రావణకాష్టం అవుతుందని ముందే చెప్పాం: తులసిరెడ్డి

ఏపీలో జగన్ పాలనపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల వైసీపీ పాలనలో ప్రత్యర్థులపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం ఆటవిక పాలన నడుస్తోందని విమర్శించారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పిందని గుర్తు చేశారు. బ్రిటీష్ వారి పాలనలో కూడా ఇన్ని దారుణాలు జరగలేదన్నారు.

టీడీపీ నేత దేవినేని ఉమాపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తే దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా… తిరిగి ఉమాపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. వైసీపీ దాడి చేస్తే… దేవినేని ఉమాపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం జగన్ జిల్లాలోనే ఎంతో మంది హత్యకు గురయ్యారని విమర్శించారు. జగన్ పద్ధతి మార్చుకోవాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకం విద్యార్థుల పాలిట శాపంలా మారిందని తులసిరెడ్డి ఆరోపించారు.

Read More: ప్రపంచంలో సమంతాదే అతిపెద్ద నోరు

రూ.25 లక్షలు గెలుచుకున్న హీరో రామ్ చరణ్

ద్రవిడ్ ఆ చిట్టీలో ఏం రాశాడు?

Advertisement

తాజా వార్తలు

Advertisement