Thursday, April 25, 2024

ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో నాకు తెలుసు: స్పీకర్ తమ్మినేని..

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం టీడీపీ నేత కూన రవికుమార్ పై సీరియస్ అయ్యారు. తమ్మినేని ముందు మీ అరుపులు , కేకలు పనికిరావని… మంచి చేసుకుని వెళదాం…లేనిపోని అరుపులు దేనికి? ప్రశ్నించారు. ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసని.. తాను కచ్చితంగా ఆ పంథాలో వెళతానని తెలిపారు. గట్టిగా నోరుపెడితే బెదిరిపోయేవాడిని కాదని.. వంద కాదు వెయ్యి అడుగులైనా ముందు కెళతానని స్పష్టం చేశారు. వామనావతారుడి మాదిరి భూమిలోకి తొక్కేస్తానని… అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఇప్పుడు అభివృద్ధి చేద్దాం….మళ్లీ ఎన్నికలొచ్చాక తిట్టుకుందామన్నారు. ఎవరి ముక్కుకు మసి అంటుకుందో ప్రజలు తేలుస్తారని స్పష్టం చేశారు. నాయకులకు అంత అహంకారం, అహంభావం పనికిరాదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 206 కోట్లతో టికెట్ కొన్నాడు..ఇప్పుడు బీజీగా ఉన్నా రాలేనంటున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement