Thursday, March 28, 2024

ఏపీ స్పీకర్ తమ్మినేని దంపతులకు కరోనా పాజిటివ్

ఏపీ స్పీకర్, వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీకి కరోనా సోకింది. వీళ్లిద్దరికీ జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తొలుత స్పీకర్ భార్యకు కరోనా రాగా వారం రోజుల క్రితం ఆమె శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని కూడా కరోనా లక్షణాలతో అదే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తమతో కాంటాక్ట్ అయిన వాళ్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలని తమ్మినేని సీతారాం కోరారు. కాగా స్పీకర్, ఆయన భార్య ఆరోగ్య పరిస్థితిపై శ్రీకాకుళం జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement