Wednesday, April 24, 2024

దొంగ ఓటు వేసేందుకు వైసీపీ కార్యకర్తల యత్నం

ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం లింగన్న పాలెంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దొంగ ఓటు వేయడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను టీడీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు.

అటు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement