Friday, April 19, 2024

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రి బొత్స సవాల్

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. అచ్చెన్నాయుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, తాను కూడా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో పోటీ చేసి ఎవరేంటో తేల్చుకుందామని అన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ అదేపనిగా డిమాండ్ చేయడం సరికాదని హితవు పలికారు. ‘అందరూ రాజీనామా చేయడం ఎందుకు? నువ్వు, నేను రాజీనామా చేద్దాం రా. నాకు ఈ సవాళ్లు నచ్చవు. దమ్ముంటే చూసుకుందాం రా, దమ్ముంటే కొట్టుకుందాం రా అనడానికి ఇవేమన్నా కుస్తీ పోటీలా?’ అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల బహిష్కరణ అంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స అన్నారు. ముందు ఓటమిని అంగీకరించడం టీడీపీ నేర్చుకోవాలని సూచించారు. టీడీపీ నేతల మాటలు చూస్తుంటే వారికి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదన్న విషయం అర్థమవుతోందని బొత్స విమర్శించారు. టీడీపీ పనైపోయిందన్న సంగతి స్పష్టమైందని, ఏపీ ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement