Thursday, March 28, 2024

ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది. తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. ధూళిపాళ్ల నరేంద్ర ఛైర్మన్ గా ఉన్న సంగం డెయిరీలో అవినీతి, అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేసి… కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో…రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement