Friday, April 19, 2024

కొనసాగుతోన్న జలవివాదం..KRMB కి ఏపీ మరోలేఖ

తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల వివాదం తగ్గడం లేదు. జలాల విషయంలో ఇరు రాష్ట్రాలు కేఆర్ఎమ్బీకి ఫిర్యాదుల పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఒకరుపై ఒకరు పోటీపడీ మరీ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై మరోసారి కేఆర్‌ఎంబీకి లేఖరాసారు తెలంగాణ ఇరిగేషన్‌ సెక్రటరీ శ్యామలరావు.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి వల్ల విలువైన నీరు వృథా అవుతోందని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్న ఆయన.. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వాడుకున్న 113 టీఎంసీల నీటిని ఆ రాష్ట్ర వాటాలో వేయాలని కోరారు.. ఇక, సెప్టెంబర్ 1 తేదీన జలసౌధలో జరిగిన 14 బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేసింది ఏపీ… విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఏ రాష్ట్రమైన నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది.. నిబంధనలు ఏక పక్షంగా ఉల్లంఘిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి జరిమానా వేయాలని కేఆర్‌ఎంబీని కోరింది.. తెలంగాణ వాడుకున్న 113 టీఎంసీలను ఆ రాష్ట్ర నీటి వాటా 299 టీఎంసీల్లో భాగంగా పరిగణించాలని కేఆర్‌ఎంబీకి విజ్ఞప్తి చేసింది ఏపీ ఇరిగేషన్‌ ఈఎన్సీ.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మద్యం షాపుల యజమానులకు గుడ్‌న్యూస్

Advertisement

తాజా వార్తలు

Advertisement