Thursday, April 25, 2024

వైసీపీ ఎమ్మెల్యేపై 10 కేసులను ఎత్తివేసిన జగన్ సర్కారు

ప్రభుత్వ విప్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న 10 కేసులను జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కోసం విజయవాడలో రాష్ట్ర స్థాయి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. అందులో ఈ 10 కేసుల విచారణ ప్రస్తుతం వివిధ దశల్లో ఉండగా.. వాటన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ ఏడాది మార్చి 23న డీజీపీ సవాంగ్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు హోంశాఖ కేసుల ఎత్తివేత ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకు వీలుగా ఆయా న్యాయస్థానాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లతో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది.

కాగా సీఎస్‌పీఏ ఆర్గనైజేషన్ పేరిట సర్వే నిర్వహిస్తున్న కొందరు సిబ్బందిని ఉదయభాను అక్రమంగా నిర్బంధించారని, వారిని కిడ్నాప్ చేసి నేరపూరితంగా బెదిరించారన్న ఫిర్యాదులపై జగ్గయ్యపేట పీఎస్‌లో కేసు నమోదైంది. మరోవైపు జగ్గయ్యపేట ఎన్టీఆర్ సర్కిల్‌లో ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆర్‌అండ్‌బీ ఏఈఈ విధులకు ఆటంకం కలిగించడం, నేరపూరిత బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. వీటిని తాజా ప్రభుత్వం ఎత్తివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement