Friday, March 29, 2024

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఎంసెట్ ఫలితాలను బుధవారం ఉదయం మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్ పేరును ఈఏపీసెట్‌గా ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు 1,66,460 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,34,205 మంది ఉత్తీర్ణత సాధించారు. గురువారం నుంచి వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచుతామని మంత్రి సురేష్ తెలిపారు. ఈనెల 18 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా సోకి పరీక్షలు రాయని వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. కాగా ఈఏపీ సెట్ ఫలితాలను https://sche.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement