Friday, March 29, 2024

ఏపీలో సెకండ్ వేవ్ సెగలు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గటం లేదు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 60,350 శాంపిల్స్‌ పరీక్షించగా… 1,393 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 08 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,296 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,36,179 కు చేరగా.. 20,07,330 మంది డిశ్చార్జ్ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 14,797 కు పెరిగింది… ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,052 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

ఇది కూడా చదవండి: ఎన్‌సీసీ ప్యానెల్‌లో MSD కి చోటు

Advertisement

తాజా వార్తలు

Advertisement