Friday, March 29, 2024

భారీగా తగ్గిన కరోనా కేసులు..

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి గడిచిన 24 గంటల్లో కొత్తగా 1628 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్త కేసులు సంఖ్య 19,41,724కు పెరిగాయి. తాజాగా 2,744 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 19,5,000 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ప్రభావంతో 22 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 13,154కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 291, చిత్తూరులో 261, నెల్లూరులో 241, కృష్ణాలో 190, ప్రకాశం జిల్లాలో 134 కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి : తెరపైకి మళ్లీ హోదా అంశం.. కేంద్రంతో ఏపీ సీఎం ‘ఢీ’?

Advertisement

తాజా వార్తలు

Advertisement