Wednesday, April 24, 2024

ఊరట: కాస్త తగ్గిన కరోనా కేసులు..

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,545 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,184 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదే సమయంలో 1,333 మంది పూర్థిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా టెస్ట్‌లతో కలుపుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,80,94,644 కు చేరింది. ఇక, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,46,841 కి పెరగగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 20,19 657 కు చేరుకుంది.. మరోవైపు.. ఇప్పటి వరకు 14,136 మంది కోవిడ్‌ బాధితులు రాష్ట్రంలో మృతిచెందగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 13,048 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్, సంతోషమే: మోహన్ బాబు..

Advertisement

తాజా వార్తలు

Advertisement