Monday, April 15, 2024

వీర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి.. భారీ పరిహారాన్ని ప్రకటించారు.  విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని సీఎం.. తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.

కాగా, చత్తీస్ గఢ్ లో భద్రతాబలగాలపై మావోయిస్టులు విరుచుకుపడిన ఘటనలో 24 మంది జవాన్ల మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement