Friday, April 26, 2024

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో ఓటేసిన ఏపీ సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు రోజా, తానేటి వనిత, బుగ్గన రాజేంధ్రనాథ్‌ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన టీడీపీ అధినేత‌ చంద్రబాబు
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు ఓటు వేశారు. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఓటు హక్కును వినియోగించు కున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement